13, మార్చి 2016, ఆదివారం

తమిళనాడు కు మదురై మకుటం

మీనాక్షి ఆలయం ,మదురై  

                                                   తమిళనాడు లోని ఒక ప్రముఖ నగరం మదురై , ఇక్కడ రాష్ట్రం లోనే పేరొందిన మీనాక్షి అమ్మన్ దేవాలయం ఉన్నది ఇది తమిళుల సాంస్కృతిక వారసత్య చిహ్నం గా పేరుపొందింది . ఇక్కడ శంకరుడు సుందరనాథుడు /సుందరేశ్వరుడు  గాను పార్వతి మీనాక్షి అమ్మ గాను పూజింపబడుచున్నారు. తమిళనాట అతి పురాతన కాలం నుండి పరిచయం లో ఉన్న దేవాలయం  ప్రస్తుత దేవాలయ కట్టడాలన్ని  16-17 శతాబ్దాలలో నిర్మిచబడినాయి.ఆలయ ప్రాంగణం లో ఉన్న వేయి కాళ్ళ మండపంలో మ్యూజియం నడపబడుచున్నది .

దర్శనం వేళలు :-ఉదయం 5:00నుండి -మధ్యాహ్నం 12:30 వరకు సాయంత్రం 4:00నుండి- రాత్రి 10:00వరకు
                                        కుమార స్వామికి  తమిళనాడు లో గల 6 ముఖ్యమైన దేవాలయాలలో 2 మదురై కి దగ్గర లోనే  ఉన్నవి . మీనాక్షి అమ్మన్ దేవాలయానికి 8కిలోమీటర్ల దూరం లో(తిరుమంగళం వెళ్ళే దారిలో ) తిరుప్పరంకుండ్రం నందు ,మరొకటి 25 కిలోమీటర్ల దూరంలో  అళగర్ కొయిల్ మీదుగా  పళముదిర్ చోళై లోను ఉన్నవి .దేశం లోని అన్ని ప్రాంతాలతో మదురై నగరం వాయు ,రోడ్డు ,రైలు మార్గాల తో కలిపి ఉన్నది  .                              

కామెంట్‌లు లేవు: