3, మార్చి 2016, గురువారం

కన్యాకుమారి క్షేత్రం -ఒక భౌగోళిక వైవిధ్యం

కన్యాకుమారి క్షేత్రం -పర్యాటక కేంద్రం   

                                భారత దేశపు దక్షిణపు కొసన ఉన్నది "కన్యాకుమారి " క్షేత్రం , ఇది తమిళనాడు రాష్ట్రంలోని  కన్యాకుమారి జిల్లాలో ఉన్నది (Head Quarter మాత్రం  నాగర్ కోయిల్ ).ఇది బంగాళా ఖాతం , హిందూ మహా సముద్రం ,అరేబియా మహా సముద్రాల సంగమ ప్రాంతం.సూర్యోదయం ,సూర్యాస్తమయం రెండు సముద్రంలోనే గమనించవచ్చు . దీనిని"కన్యాకుమారి అగ్రము" అనే పేరున్నది . చక్కని బీచ్ లు ఉన్నాయిక్కడ .ఇది ప్రముఖ పుణ్య క్షేత్రమే కాక పర్యాటక కేంద్రం కుడా .
Kanya Kumari Amman  

 కన్యాకుమారి /భగవతి అమ్మన్ ఆలయం :-- కుమారి అమ్మన్ గా పేరొందిన కన్య కుమారిని ఇక్కడ పార్వతి దేవి అవతారం గా ఇక్కడ భావిస్తారు. భాణాసుర  సంహరార్థం పార్వతీదేవి  ఇక్కడ బాలిక గా వచ్చి  , తపమాచరించి , అసుర సంహారం కావించి కుమారి అమ్మన్ గా ఇక్కడ అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి.  .కురుక్షేత్ర యుద్ధం లో పాల్గొనటానికి ఇష్టపడని బలరాముడు చేసిన తీర్ధ యాత్ర లో బాగం గా ఈ ఆలయాన్నిదర్శిం చాడని ఇక్కడివారు చెబుతారు .

 వివేకానంద రాక్ మెమోరియల్(వివేకానంద పురం):1892 సంవత్సరంలో USA చికాగో సభలకు వెళ్ళటానికి ముందు  స్వామి వివేకానంద 3 రోజులపాటు ఇక్కడ ధ్యానం చేసారు. కన్యాకుమారి తీరానికి 500 మీటర్ల దూరంలో  4 ఎకరాలు వైశాల్యం ఉన్న కొండపై  12 అడుగుల ఎత్తైన వివేకానందుని కాంస్య విగ్రహం ప్రతిష్టించారు . ఇక్కడకు ఫెర్రీ  సౌకర్యం ఉన్నది .

తిరువళ్ళువార్ విగ్రహం:- సుప్రసిద్ద  తమిళ  తత్వవేత్త, కవి అయిన  తిరువళ్ళువార్ యొక్క 133 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని  తమిళనాడు ప్రభుత్వం 2000 సంవత్సరం లో  వివేకానంద రాక్ మెమోరియల్ కు 200-300 అడుగుల దూరంలో ఉన్న మరో చిన్న గుట్ట (కొండ) పై  ప్రతిష్టించించారు .
Gandhiji Memorial Hall 

మహాత్మా గాంధి స్మారక మందిరం:-1954సంవత్సరం లో ఈ స్మారక మందిరాన్ని నిర్మించి  మహాత్మా గాంధీ అస్థికలు ఉన్న కలశాన్ని ఇక్కడ ఉంచారు .

సుచీంద్రం:- నగర్ కోయిల్ నుండి కన్యాకుమారి వెళ్ళే మార్గంలో కన్యాకుమారి కి 13,నాగర్ కోయిల్ కు 8 కిలోమీటర్ల దూరం లో ఉన్నది . ధను మలయన్ ఆలయం ఇక్కడ ఉన్నది .
   
                                          కాశ్మీర్ తో  సహా దేశం లోని అన్నిప్రాంతాలనుండి కన్యాకుమారి క్షేత్రానికి రైళ్ళు నడుస్తున్నాయి . రాజధాని చెన్నై కి 700 కిలోమీటర్ల దూరం లో ఉన్నపటికీ , చెన్నై తో సహా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి బస్సు లు నడుస్తున్నాయి .  ఇక్కడ కేరళ రాజధాని తిరువనంతపురం 90 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నది .మధురై కు తిరునల్వేలి మీదుగా  245 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .తిరువనంతపురం  మదురై లలో  కూడా విమానాశ్రయాలు  ఉన్నవి . 


కామెంట్‌లు లేవు: