శ్రీ రాముడు అర్చించిన జ్యోతిర్లింగం-రామేశ్వరం
![]() |
| రామనాధ స్వామి దేవ స్థానం |
ఆది శంకరాచార్యులు చెప్పిన "చార్ దామ్" యాత్ర లో రామేశ్వర క్షేత్ర దర్శనం ఒకటి . మిగిలిన మూడు ద్వారక ,బదరీనాథ్ ,పూరి క్షేత్రాలు . తమిళ నాడు రాష్ట్రం, రామనాథ పురం జిల్లా లో ఆగ్నేయ దిశన బంగాళ ఖాతం లో చిన్న ద్వీపం గా ఉన్నది . రాజధాని చెన్నై నగరానికి 560 కిలో మీటర్ల దూరంలో ఉన్నది . కాశీ యాత్ర వారణాశి లోని విశ్వేశ్వ రుని దర్శనం తో పూర్తి కాదని , గంగా జలాన్ని రామేశ్వరం వద్ద సాగరం లో కలిపి రామనాథుని దర్శనంతోనే పూర్తి అవుతుందని చాలామంది ఆద్యాత్మిక వేత్తల విశ్వాసం .
త్రేతాయుగం లో శ్రీ రామ చంద్రుడు ఇక్కడినుండే సముద్రంపై వారథి ని (రామేశ్వర దేవాలయానికి 20కిలోమీటర్ల దూరం లో ధనుక్ష్కోటి వద్ద ) నిర్మింఛి లంక లో ప్రవేశించి రావణ సంహారం కావించిన అనంతరం బ్రహ్మ హత్య పాప నివారణా పరిహారార్ధం ఇక్కడే రామేశ్వర ద్వీపం లో లింగ ప్రతిష్ట కావించాడు . అందుచేత ఈ క్షేత్రం లో పరమేశ్వరుడు ఇక్కడ "రామనాధుడు" గా పూజింపబడుచున్నాడు . 12 జ్యోతిర్లింగాలలో ఒకటి . అత్యద్బుత శిల్పకళా చాతుర్యం నిర్మించ బడిన ఈ ఆలయం దేశం లోని పెద్ద దేవాలయాలలో ఒకటి . ఇక్కడ ఆలయంలో రెండు లింగాలు ఉన్నాయి అందులో ఒకటి ఆదిశంకరా చార్యులు వారు ప్రతిష్టించిన స్పటిక లింగంఒకటి . ప్రాతః కాల వేళలో కొద్దిసేపు మాత్రమే ఈ స్పటిక లింగ దర్శనం ఉంటుంది .
ఆలయ ప్రాంగణం లో 22(బావులు ) పవిత్ర తీర్థాలున్నాయి . "ఈ తీర్థాలలోస్నానామాచరించటం" అనేది రామనాధలింగదర్శన లో ప్రధానమైన కార్యక్రమం . గందమాదన పర్వతం ( 2కిలోమీటర్ల దూరంలో చిన్న కొండ ) లక్ష్మణ తీర్థం ( 2కిలోమీటర్ల దూరంలో),సాక్షి ఆంజనేయ స్వామి ఆలయం ( అక్కడ ఉండే రామ సేతువు కు వాడిన రాళ్ళూ నీటిలో తేలుతాయి ) జడ తీర్థం కోదండ రామాలయం (విభీ షు ణు ని కి పట్టాభిషేకం జరిగిన ప్రాంతం మొదలైనవి కొన్ని ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలు , మన మాజీ రాష్ట్రపతి ,అంతరక్ష శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి జన్మ స్థలం ఇదే . ఆలయానికి దగ్గరలోనే ఆయన నివసించిన భవనం ఉన్నది .
Main Land లో ప్రముఖ పుణ్య క్షేత్రం మీనాక్షి సుందరే శ్వరుల క్షేత్రం మధురై కు ఇది 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .యిక్కడే విమానాశ్రయం కుడా ఉన్నది . దేశం లోని అన్ని ప్రాంతాలనుండి ఇక్కడకు రైళ్ళు నడుస్తున్నాయి . తమిళనాడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి ప్రైవేటు /రాష్ట్ర ప్రభుత్వ బస్సులు నడుస్తున్నాయి .
త్రేతాయుగం లో శ్రీ రామ చంద్రుడు ఇక్కడినుండే సముద్రంపై వారథి ని (రామేశ్వర దేవాలయానికి 20కిలోమీటర్ల దూరం లో ధనుక్ష్కోటి వద్ద ) నిర్మింఛి లంక లో ప్రవేశించి రావణ సంహారం కావించిన అనంతరం బ్రహ్మ హత్య పాప నివారణా పరిహారార్ధం ఇక్కడే రామేశ్వర ద్వీపం లో లింగ ప్రతిష్ట కావించాడు . అందుచేత ఈ క్షేత్రం లో పరమేశ్వరుడు ఇక్కడ "రామనాధుడు" గా పూజింపబడుచున్నాడు . 12 జ్యోతిర్లింగాలలో ఒకటి . అత్యద్బుత శిల్పకళా చాతుర్యం నిర్మించ బడిన ఈ ఆలయం దేశం లోని పెద్ద దేవాలయాలలో ఒకటి . ఇక్కడ ఆలయంలో రెండు లింగాలు ఉన్నాయి అందులో ఒకటి ఆదిశంకరా చార్యులు వారు ప్రతిష్టించిన స్పటిక లింగంఒకటి . ప్రాతః కాల వేళలో కొద్దిసేపు మాత్రమే ఈ స్పటిక లింగ దర్శనం ఉంటుంది .
ఆలయ ప్రాంగణం లో 22(బావులు ) పవిత్ర తీర్థాలున్నాయి . "ఈ తీర్థాలలోస్నానామాచరించటం" అనేది రామనాధలింగదర్శన లో ప్రధానమైన కార్యక్రమం . గందమాదన పర్వతం ( 2కిలోమీటర్ల దూరంలో చిన్న కొండ ) లక్ష్మణ తీర్థం ( 2కిలోమీటర్ల దూరంలో),సాక్షి ఆంజనేయ స్వామి ఆలయం ( అక్కడ ఉండే రామ సేతువు కు వాడిన రాళ్ళూ నీటిలో తేలుతాయి ) జడ తీర్థం కోదండ రామాలయం (విభీ షు ణు ని కి పట్టాభిషేకం జరిగిన ప్రాంతం మొదలైనవి కొన్ని ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలు , మన మాజీ రాష్ట్రపతి ,అంతరక్ష శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి జన్మ స్థలం ఇదే . ఆలయానికి దగ్గరలోనే ఆయన నివసించిన భవనం ఉన్నది .
Main Land లో ప్రముఖ పుణ్య క్షేత్రం మీనాక్షి సుందరే శ్వరుల క్షేత్రం మధురై కు ఇది 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .యిక్కడే విమానాశ్రయం కుడా ఉన్నది . దేశం లోని అన్ని ప్రాంతాలనుండి ఇక్కడకు రైళ్ళు నడుస్తున్నాయి . తమిళనాడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి ప్రైవేటు /రాష్ట్ర ప్రభుత్వ బస్సులు నడుస్తున్నాయి .

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి