17, మార్చి 2016, గురువారం

తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి - కేరళ రాష్ట్రంలో గురువాయూర్

  శ్రీ కృష్ణుని ఆలయం, గురువాయూర్, కేరళ  


                                       తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి వలే గురువాయుర్ కేరళ రాష్ట్రంలో ప్రసిద్ద పుణ్య క్షేత్రం.  అంతే కాక;దేశం లోని ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఇది ఒకటి . శ్రీ కృష్ణుడు ఇక్కడ కొలువై ఉన్న దైవం .   జిల్లా కేంద్రం త్రిచూర్ కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . మహా భారత కాలం లో అభి మన్యుని మనుమడు జనమే జయుడు కృష్ణుణ్ణి పూజించినది ఇక్కడేదేశం లోని చాల దేవాలయాల్లో ఉన్నట్లే ఇక్కడ ఆలయ ప్రవేశానికి డ్రస్ కోడ్ ఉన్నది . పురుషులు దోవతి (పంచె ) మాత్రమే ధరించాలి. స్త్రీలు మాత్రం దక్షినాది సంప్రదాయమైన చీర లేదా ఉత్తరాది వారి వాలే సల్వార్ కమీజ్ ధరించవచ్చును .


దర్శనం వేళలు తెల్లవారు జామున 3:00 లకు వివిధ పుజదికాలతో ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు మరల సాయంకాలం   4:30 నుండి రాత్రి 9:30 వరకు 
                 రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి రోడ్ కనెక్టివిటీ బాగా ఉన్నది , గురువాయుర్ కు రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ త్రిచూర్ నుండి మాత్రమే దేశం లోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్ట్ విటి  బాగా ఉన్నది .  త్రిచూర్ కు 90 కిలో మీటర్ల దూరం లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది.

కామెంట్‌లు లేవు: