23, మార్చి 2016, బుధవారం

గ్రిష్నేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా



                                మహారాష్ట,  ఔరంగాబాద్ కు 35 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ది చెందిన ఎల్లోరా గుహల మీదుగా వెరుల్ గ్రామం చేరవచ్చు ఇక్కడే శ్రీ ఆది శంకరా చార్యులు ప్రవచించిన 12 జ్యోతిర్లింగాల చివరిది గ్రిష్నేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. అతి పురాతనమైన ఈ దేవాలయాన్ని 18 శతాబ్దం లో ఇండోర్ పాలకురాలు రాణి అహల్య బాయి హోల్కర్ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఎర్ర రాతి చేత నిర్మించబడిన ఆలయం. స్థల పురాణాల ప్రకారం  తన భక్తురాలైన గ్రిష్మ కు ఇచ్చిన వరం కారణంగా ఇక్కడ శివుడు స్వంభువుగా ఆవిర్భవించాడు, అందుచేత ఇక్కడ పరమ శివుణ్ణి గ్రిష్నేశ్వరుడు అని పిలుస్తారు. ఆలయ దర్శనానికి వచ్చే యాత్రికులు సాంప్రదాయ వస్త్రాలే (పురుషులైతే షర్ట్ లేకుండా ) ధరించాలి.
       

               ఈ ఆలయానికి దగ్గరలోనే ఛత్రపతి శివాజీ తండ్రి షాహాజి భోంస్లే సమాది మందిరం ఉన్నది. ఔరంగాబాద్ కు18 కిలోమీటర్ల దూరంలో . . . . . . . . . దౌలతా బాద్, దేవగిరి (లేదా)దౌలతాబాద్ కోట ఉన్నది, అక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో . . . . . . . . .  ఎల్లోరా గుహాలు ఉన్నాయి. ఇక్కడ నుండి 2 కిలో మీటర్లు ప్రయాణించి . . . . . . . . .   వెరుల్ గ్రామానికి గ్రామం చేరుకోవచ్చు. ఔరంగాబాద్ లో రైల్వే స్టేషన్ ఉన్నది, ఎయిర్ పోర్ట్ కూడా ఉన్నది. వెరుల్ నుండి నాసిక్ వెళ్ళే మార్గంలోనే 100 కిలోమీటర్ల దూరం లోనే షిర్డీ క్షేత్రం ఉన్నది .   

కామెంట్‌లు లేవు: