పూరిక్షేత్రం వైష్ణవ దివ్యదేశాల్లో (ఆలయాల్లో ) ఒకటి
'పూరి' పేరొందిన వైష్ణవ పుణ్య క్షేత్రం
దేశం లోని ప్రముఖ దేవాలయాలలో పూరి ఒకటి . ఈ భారి ఆలయ సముదాయం ఒడిషా (ఒరిస్సా )రాష్ట్రం లో బంగాళా ఖాతం సముద్ర తీరం ఉన్నది . పురి కి ఆధ్యాత్మికం గా పురుషోత్తమక్షేత్రం(మహావిష్ణువు కు పురుశోత్తముడనే పేరు ఉన్నది ) శ్రీ క్షేత్రం అనే పేర్లు కూడా ఉన్నాయి . ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ దామ్ క్షేత్రాలలో పూరి ఒకటి (మిగిలినవి బదరీనాథ్ ద్వారక రామేశ్వరం ). జగాలన్నిటికి నాథుడైన విష్ణు మూర్తి జగన్నాదుడిగా ,సోదరుడు బలరాముడు (బలభద్రుడు),సోదరి సుభద్ర ఇక్కడ కొలువై ఉన్నారు .ఇక్కడి స్థల పురాణం ప్రకారందైవాజ్ఞ ప్రకారం వేపకొయ్య పై సుభద్ర, బలబద్ర ,జగన్నాధుల విగ్రహాల తయారి సమయం లో శిల్పి కి ఆటంకం కలుగటం చేత అవి అసంపూర్ణంగా ఉండిపోయాయని ,బ్రహ్మ దేవుడి ఆజ్ఞ ప్రకారం వాటిని యధాతదం గా ప్రతిష్టించారని చెబుతారు . సనాతన ఆచారాలకు నిలయం ఈ పూరి క్షేత్రం ,ప్రాచీన సంప్రదాయాలను ఇంకా ఇక్కడ పాటిస్తున్నారు . అన్య మతస్తులకు ఆలయ ప్రవేశం లేదు . నిత్యం దేశం నలుమూలల నుండి వచ్చేయాత్రికుల జగన్నాధుని నామస్మరణ తో పూరి దేవాలయం మారుమ్రోగుతూ ఉంటుంది .
దేశం లో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్నఇక్కడి దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సం.రం. లకొక సారి మార్చి నూతన దేవతా మూర్తులు ప్రతిష్టిం చుతూ ఉంటారు .దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు . లక్షలాది మంది భక్తులు పాల్గొంటూ జగన్నాధ రధ యాత్ర గా పిలువబడే ఘోషా యాత్ర ప్రతి సంవత్సరం ఆషాడ శుధ్ధ విధియ రోజున ప్రారంభమై 3కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది తరువాత సుభద్ర ,బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు పూరీ ఆలయానికి చేరటం(బహుదా యాత్ర ) తో ముగుస్తుంది. ఇది 12 రోజులు పాటు జరిగే ఉత్సవం . జగన్నాధుని రధం పేరు నందిఘోష(16చక్రాలు) ,బలభద్రుని రధం పేరు తాళ ద్వజం(14 చక్రాలు) సుబద్ర రధం దర్పదళని (12 చక్రాలు) వీటిని ప్రతిసంవత్సరం నూతనంగా తయారుచేస్తారు . ఈ రధ యాత్ర అంతర్జా తీయ ఉత్సవం ఇతర దేశాల్లోని హిందువులు ఈ ఉత్సవాన్ని ఆయచోట్ల నిర్వహిస్తారు .
| గుండిచా ఆలయం |
దేశం లోని అందమైన బీచ్ లలో పూరి బీచ్ ఒకటి ఇది ఎల్లపుడు దేశ ,విదేశి పర్యాటకులతో కళకళ లాడుతూ ఉంటుంది . దేశం లోని అన్ని ప్రాంతాలనుండి ఇక్కడకు రైలు ప్రయాణ సౌకర్యం ఉన్నది (చెన్నై -హౌరా రైలు మార్గానికి కుర్దా రోడ్ junction కు పూరి రైలు మార్గం కలపబడి ఉంటుంది .) మన రాష్ట్రము లోని విశాఖపట్నం కు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది . విమాన ప్రయాణానికి 58 కిలో మీటర్ల దూరంలో రాష్ట రాజధాని భువనేశ్వర్ లో ఎయిర్ పోర్ట్ ఉన్నది
సముద్ర తీరం వెంబడి 36 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ద సూర్య దేవాలయం కోణార్క్ ఉన్నది. దేశం లోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు పూరి కి 50 కిలోమీటర్ల దూరం లోనే ఉన్నది .



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి