మహానంది
మహానంది యాత్ర లో ఉన్న నందులు 9 అవి 1. ప్రధమ నంది 2. నాగనంది 3. వినాయక నంది 4. గరుడనంది 5. ఉగ్ర నంది 6. మహానంది 7. సూర్య నంది 8 విష్ణు నంది 9 సోమ నంది . కర్నూలు జిల్లా లోనంద్యాల కు 18 కిలోమీటర్ల దూరంలో నవనందులలో ఒకటైన మహానంది క్షేత్రమున్నది .ఇది ఒక మండల కేంద్రం కూడా . మిగిలిన 8 నంది క్షేత్రాలు ఈ మహానంది కి దగ్గరలోను , నంద్యాల పట్టణ పరిధి లోనే ఉన్నాయి . నల్లమల అడవులలో పర్వత పంక్తుల నడుమ 7 శతాబ్దం లో బాదామి చాళక్యు లచే నిర్మింప బడిన ఈ మహానంది క్షేత్రము లో పరమ శివుడు మహానందీశ్వరుడు గా, పార్వతి దేవి కామేశ్వరి దేవి గా పూజింప బడుచున్నారు . ఆలయ ప్రాంగణం లో పుష్కరిణి ఉన్నది . దీనిని రుద్రగుండం అని పిలుస్తారు .ఇదే ఆలయ ప్రాంగణం ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఈ స్వామికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి . ఇక్కడ పాండవులు ప్రతిష్టించిన లింగాలున్నాయి .
![]() |
| ఆలయానికి సమీపం లో ఉన్న నంది విగ్రహం |
గుంతకల్ -విజయవాడ రైలు మార్గంలో ఉన్న నంద్యాల 18 కిలోమీటర్ల దూరం లోను మరో చిన్న Halt గాజులపల్లి 12కిలోమీటర్ల దూరం లోను ఉన్నది . నంద్యాల నుండి బస్సు /Auto సౌకర్యాలున్నాయి .
మహానంది కి దగ్గరలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు :-
యాగంటి :-ప్రముఖ శైవ క్షేత్రం , వయా గాజుల పల్లి 68 కిలోమీటర్ల దూరంలో
అహోబిలం :- ప్రముఖ నరసింహ క్షేత్రం ,వయా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .

