11, ఫిబ్రవరి 2016, గురువారం

యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం


కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటి అనే చిన్న గ్రామంలో ఉమా మహేశ్వర దేవాలయం ఉన్నది ఈ ఆలయాన్ని వేంకటేశ్వరుని ప్రతిష్టించే ఉద్దేశ్యం నిర్మించారు కాని వేంకటేశ్వరుని విగ్రహంలో చిన్న లోపం ఉండటం చేత  దాని ప్రక్కనే ఉన్న గుహలో ప్రతిష్టింఛి ఇక్కడ ఉమా మహేశ్వర లింగాన్ని ప్రతిష్టించారు . ఆలయం ఉన్న నంది  పరిమాణం పరంగా పెరుగుతూ యాగంటి బసవన్నగా  ప్రసిద్ది కెక్కింది పోతులూరి వీర బ్రహ్మం కాల జ్ఞానం లో ఈ నంది ప్రస్తావన ఉన్నది.  ఆలయ ప్రాగణం లో పుష్కరిణి లో నీరు అన్ని కాలాల్లోను ఒకేమట్టం లో ఉంటుంది  అగస్త్య మహాముని స్నానమాచారించటం  దీన్ని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు . రోకళ్ళ గుహ ,శంకర గుహ ,ఎర్ర జాల గుహ యాత్రీకులను  ఆకర్షింస్తుంటాయి. ఇక్కడ కాకి కనిపించదు . దీనికి కారణం అగస్త్య మహాముని శాప కారణమని ఇక్కడివారు చెబుతారు .



యాగంటికి చేరుకునే మార్గాలు:-
దిగువ పేర్కొన్న 4 పట్నాలకు తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలనుండి రైలు ప్రయాణ సౌకర్య ముంది . 

1 . కర్నూలు :- నగరం నుండి via  బేతంచెర్ల రోడ్డు మార్గం ద్వారా 74 కిలోమీటర్లు దూరం. 
2 . నంద్యాల :-  నుండి  via బనగానపల్లి  రోడ్డు మార్గం ద్వారా 50 కిలోమీటర్లు దూరం.
3. Dhone (ద్రోణాచలం ) :- నుండి వయ బేతంచెర్ల రోడ్డు మార్గం ద్వారా 42 కిలోమీటర్లు దూరం. 
4 . తాడిపత్రి :- నుండి వయ బేలుం గుహలు రోడ్డు మార్గం ద్వారా 80 కిలోమీటర్లు దూరం ఇక్కడి నుండి Bus /Taxi /Auto లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  







యాగంటి పరిసరాల్లో చూడతగిన  ప్రదేశాలు:-
బనగానపల్లి :- ఇది పోతులూరి వీర బ్రహ్మం గారి కాలజ్ఞానం భూస్తాపితం అయున గ్రామం   12 కిలోమీటర్లు దూరం.                 బేలుం గుహలు :- దేశంలో పెద్ద గుహలలో ఇవి ఒకటి.  తాడిపత్రి  కి వెళ్ళే మార్గం లో  45 కిలోమీటర్లు దూరం లో ఉన్నాయి . 
మహానంది :- ప్రసిద్ద శైవ క్షేత్రం 65కిలోమీటర్లు దూరంలో ఉన్నది (నంద్యాలకు 18 కిలో మీటర్ల దూరం లో ).


కామెంట్‌లు లేవు: