అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి (ద్రాక్షరామ మాణిక్యాంబ దేవాలయం)
పురాణ కాలం లో పరమశివుని కుమారుడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించే క్రమంలో అతని కంఠాన్నిచేదించగా అందున్నశివుని ఆత్మ లింగం 5ముక్కలై భూమి పై పలు చోట్ల పడగా పడిన చోట దేవతలు వాటిని అక్కడ ప్రతిష్టించారని అవి పంచారామాలుగా ప్రసిద్ది చెందాయని భక్తుల విశ్వాసం. ఇవి అన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కలిగి , తూర్పు గోదావరి జిల్లా లో రెండు, పశ్చిమ గోదావరి జిల్లా లో రెండు , గుంటూరు జిల్లా లో ఒకటి ఉన్నాయి అవి
1. దాక్షారామం (ద్రాక్షారామం) :- తూర్పుగోదావరి జిల్లా, ద్రాక్షారామంలో ఈ క్షేత్రం 10 శతాబ్ధ కాలంలో తూర్పు చాళుక్యపాలకుడైన భీముడి చేత నిర్మిచబడినట్లు తెలుస్తుంది ఇక్కడ భీమేశ్వరుడు, మాణిక్యాంబ అమ్మవారు (అష్టా దశ శక్తిపీఠాల్లో ఈ ఆలయం ఒకటి) కొలువై ఉన్నారు. పురాణ కాలంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం అందు చేత ఇది దాక్షారామం కాలక్రమేణా ద్రాక్షారామం అయినది. రాజమహేంద్రవరానికి (రాజమండ్రి)కి 43కిలో మీటర్ల దూరంలోను ద్వారపూడి-యానాం రోడ్ లో దాక్షారామం ఉన్నది(కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి (NH- 214) కు18 KM దూరం) దీనికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ద్వారపూడి 25 కిలో మీటర్ల దూరంలో ఉంది .
2. అమరారామం (అమరావతి) :- విజయవాడ కు 40 కిలో మీటర్ల దూరంలో గుంటూరు జిల్లా లో కృష్ణా నది తూర్పు తీరంలో ఉన్న అసలైన అమరావతి గ్రామం ఇది .ఇది గుంటూరు పట్టణానికి 35 కిలో మీటర్ల దూరం లో రాష్ట్ర నూతన రాజధాని "అమరావతి " గా పిలువబడుతున్న పలుగ్రామాలతో కూడిన ప్రాంతానికి ఇది దగ్గరగా ఉన్నది. నూతన రాజధాని "అమరావతి " అబివృద్ది చర్యల దశ ఇది కూడా రాజధానిలో కలసి పోతుంది . ఇక్కడ కృష్ణా తీరంలో ఇంద్రుడు శివలింగ ప్రతిష్ట చేయటం చేయటం చేత ఇది అమరారామం అయింది. శివుడు అమరేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు .ఇక్కడ పార్వతి దేవి బాల ఛాముండేశ్వరి గా పూజింపబడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించిన మండపం ఆయన వేయించిన శాసనాలు ఆలయ ప్రాగణం ఉన్నాయి ,అమరావతి లో పురావస్తు శాఖ వారి మ్యూజియం అమరావతి స్తూపంఉన్నాయి.
3. క్షీరారామం (పాలకొల్లు ) :- పశ్చిమ గోదావరి జిల్లాలో NH 214 పై పాలకొల్లు ఉన్నది. ఒకానొక సందర్బం లో శివుడు భూమిపై బాణాన్ని సంధించగా క్షీరం ఉద్బవించి కొలనుగా మారినదని, పాలకొలను కాలక్రమేణ పాలకొల్లు గా మారిందని ఇక్కడివారి విశ్వాసం. త్రేతా యుగంలో రాముడు ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం క్షీరారామలింగేశ్వరుడు గాను తల్లి పార్వతి దేవి గాను పూజింప బడుచున్నారు . 125 అడుగుల ఎత్తైన ఆలయ గోపురం పాలకొల్లు గోపురం గా పరిసర ప్రాంతాలలో ప్రసిద్ది. విజయవాడ కు 140 కిలో మీటర్ల (via Gudivada -NH -9,NH 214) దూరం లో ఉన్నది. విజయవాడ- నరసాపురం రైలు మార్గం లో పాలకొల్లు ఒక ముఖ్య మైన స్టేషన్.
4. సోమారామం (భీమవరం) :- పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం పట్టణం లో ఈ సోమారామ క్షేత్రం ఉన్నది చంద్రుడు ప్రతిష్ఠించటం చేత శివుడు సోమేశ్వ రుడుగా,పార్వతీదేవి అన్నపూర్ణ గాను పూజింప బడుచున్నారు. ఇది విజయవాడ నగరానికి 120 కిలో మీటర్ల దూరం లో పాలకొల్లు వెళ్ళ మార్గంలో (రైలు ,బస్సు ప్రయాణాలు రెండింటి లోను ) ఉన్నది.
5. కుమారారామం (సామర్లకోట) :- తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట లో ఉన్నదీ క్షేత్రం . ద్రాక్ష రామ క్షేత్రాన్ని నిర్మించిన వేంగి తూర్పు చాళుక్య రాజు భీముడే ఈ ఆలయాన్ని నిర్మించాడు శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్టించటం ఇక్కడ పరమేశ్వరు రుణ్ణి కుమార భీమేశ్వ రుడు గా పుజిస్తారు, పార్వతి దేవి బాల త్రిపుర సుందరిగా పూజింప బడుతుంది విజయవాడ -విశాఖ పట్నం రైలు మార్గం లో సామర్లకోట ఒక రైల్వే కూడలి (Junction). విజయవాడ కూ 200 కిలోమీటర్ల దూరంలో NH 16గా మారిన NH 5 పై ఉన్నది .





కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి