చిత్తూరు జిల్లా లో చంద్ర గిరి కోట విజయనగర సామ్రాజ్యంలో అతి ప్రదానమైనది.శ్రీ కృష్ణ దేవరాయలు తిరుమల ను సందర్శించే సమయం లో ఈ కోట లో విడిది చేసే వారు . విజయనగర సామ్రాజ్య కడపటి చక్రవర్తుల రాజధాని కూడా ఇదే . ముస్లిం పాలకుల దాడుల్లో కోట శిధిలం కాగా మిగిలిన రాజభవనం లో రాష్ట్ర ప్రభుత్వం మ్యుజియం ను ఏర్పాటు చేసింది . అంతే కాక కోట ఔన్నత్యాన్ని తెలియచేయటానికి సాయం వేళా sound &light show ని కూడా నిర్వహిస్తుంది .
చంద్రగిరి కి సమీపాన 52 కిలో మీటర్ల దూరం లో తలకోన జలపాతం ఉన్నది . ఈ జలపాతానికి వెళ్ళే మార్గం లోనే 5 కిలో మీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం లో విశేష ప్రాధాన్యమున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది .
చంద్రగిరి కి సమీపాన 52 కిలో మీటర్ల దూరం లో తలకోన జలపాతం ఉన్నది . ఈ జలపాతానికి వెళ్ళే మార్గం లోనే 5 కిలో మీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం లో విశేష ప్రాధాన్యమున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది .
ఇది తిరుపతి నగరానికి 16 KM దూరంలో చిత్తూరు రోడ్ మార్గంలో ఉన్నది రోడ్డు మార్గం తప్పితే చంద్రగిరి కి రైలు మార్గం లేదు .ధగ్గరలో ఉన్న చిత్తూరు , తిరుపతి స్టేషన్ లు దేశం లోని ప్రధాన రైలు మార్గం లోనే ఉన్నాయి .మన రాష్ట్రము లోనే కాక Kerala లో కూడ మరో కోట 'చంద్రగిరి ' పేరు తో ఉన్నది .
