27, ఫిబ్రవరి 2016, శనివారం

The Temple City of India ,Bhubaneswar

దేవాలయాల రాజధాని -భువనేశ్వర్ 

                              ఒడిష రాజధాని నగరం  భుబనేశ్వర్ ప్రాచీన శతాబ్దాల్లో మరొక పేరు "త్రి భుబనేశ్వర్ " తో ప్రసిద్ది చెందినది . ఈ నగరం లో ఒకప్పుడు 2000 దేవాలయాలు  ఉండేవని  పురాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రస్తుతం  షుమారు  600  దేవాలయాలున్నాయి . 1946 లో ఈ నగర అభివృద్దికి జర్మన్ ఇంజినీర్  Otto Konigsberger  పధక రూపకల్పన చేశాడు, ప్రసిద్ది చెందిన ఆలయాలన్నీ పాత నగరంలోనే ఉన్నాయి .
కొన్ని ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలు
1.లింగ రాజ దేవాలయం :-
లింగరాజ దేవాలయం 
భుబనేశ్వర్ నగరం ఉన్న దేవాలయాలలో కెల్ల అతి పెద్దది. 1000ఏళ్ళకు పైబడిన చరిత్ర కలిగినది   కాళింగ వాస్తు శిల్ప కళ అలరారుతుంది . ప్రధాన గోపురం ఎత్తు 180 అడుగులు ఇక్కడ శివుణ్ణి  లింగరాజ్ గాను ,త్రిభుబనేశ్వరుడు పిలుస్తారు . త్రిభుబనేశ్వరుడు  అంటే  మూడు లోకాలకు నాయకుడు అని అర్ధం . ఈయన పేరుపైనే నగరానికి భుబనేశ్వర్ అనే పేరువచ్చింది . ఈ ఆలయ ప్రాంగణంలో  లెక్కలేనన్ని ఉపాలయాలు  ఉన్నాయి. ఈ ఆలయం భుబనేశ్వర్ airport కు 4-5 కిలోమీటర్ల దూరంలోను ,ప్రధాన రైల్వే స్టేషన్ కుడా 4-5 కిలోమీటర్ల దూరంలోనే  ఉన్నది
2.ముక్తేశ్వర ఆలయం:-
ముక్తేశ్వర ఆలయం
ఒకే ప్రాంగణం ఉన్న ముక్తేశ్వర ఆలయం, పరశురామ మందిరం1000 ఏళ్ళ క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో శంకరుడు ప్రధాన దైవం ఇక్కడ చిన్న బావి ఉన్నది.దీనిని"మరిచికుండం"అనిపిలుస్తారు ఇక్కడ   స్నానమాచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని స్థానికుల  నమ్మకం.

పరశు రామేశ్వర మందిర్ 
3.పరశు రామేశ్వర మందిర్ :-  1500 ఏళ్ళ క్రితం నిర్మించన ఆలయం  ఈ ఆలయాల సుముదాయం లింగరాజ ఆలయానికి అతి సమీపం లోనే ఉన్నది. ఇక్కడ ఆలయం లో  శివుడు లింగ రూపం లోను , విష్ణువు శాలిగ్రామ రూపం దర్శన మివ్వటం చేత దీనిని పరశు రామేశ్వర మందిరమంటారు .
కేదార గౌరీ ఆలయం 








4.కేదార గౌరీ ఆలయం:- స్థానికంగా ఈ దేవా లయంను కేదారేశ్వర మందిరంగా పిలుస్తారు. Shital Sasthi festivalగా పిలువబడే శివపార్వతుల కళ్యాణం ప్రతిసంవత్సరం అత్యంత వైభవంగాఇక్కడ నిర్వహిస్తారు










5.రాజరాణి మందిర్:- ఇది 11వ శతాబ్దంలో నిర్మించబడినది . లేత ఎరుపు -పసుపు రంగు రాతిచేత నిర్మించటం చేత దీనికి రాజ రాణి మందిర్ అనే పేరు వచ్చింది (ఆ రకం స్టోన్ ను "రాజా రాణి స్టోన్ " అని పిలుస్తారు). గర్భాలయం ఎటువంటి దైవ ప్రతిమ లేదు , అయినప్ప టికీ దీనిని శైవ క్షేత్రం గా పరిగణింప బడుతుంది ,
రాజా రాణి మందిర్ 
 ఆలయ కుడ్యాలపై స్త్రీ పురుష మైధున దృశ్యాలు కూడా చెక్కబడి ఉండటం చేత స్థానికం గా దీనిని లవ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఆలయం చుట్టూ చక్కని గార్డెన్ ఉన్నది .కేదార్ గౌరి ఆలయం కి   దగ్గరలోనే ఉన్నది . సిద్దే శ్వర ఆలయం   Vaital Duel Temple, దులదేవి టెంపుల్  మొదలైనవన్నీ సమీపం లోనే ఉన్నవి .మొత్తం పై ఆలయాలన్నీ బిందు సాగర్ సరస్సు  పరిసరాల్లోనే ఉన్నాయి .
6.ఉదయగిరి & కందగిరి గుహలు :-ఈ గుహాలు పాక్షికంగా సహజసిద్దమైనవి .  లింగ రాజ ఆలయానికి 9 కిలోమీటర్ల దూరం లోను , ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు 7 కిలోమీటర్ల దూరం లోనున్నాయి . 
7.నందన్ కానన్ జూలాజికల్ పార్క్:- సుందరమైన కంజియా సరస్సు తీరం లోను, గరాజ దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరం లొఉన్నది.  దగ్గరలోనే బారంగ్ అనే చిన్నపాటి రైల్వే స్టేషన్ ఉన్నది . నందన్ కానన్ బొటానికల్ గార్డెన్ కూడా ఇక్కడ ఉన్నది .                                   

8.ఒడిష స్టేట్ మ్యూజియం :- రాష్ట్ర మ్యుజియం  లింగరాజ దేవళానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది . పూరి  జగన్నాధ  దేవాలయం , కోణార్క  సూర్య  దేవాలయం రెండూ షుమారు 65 కిలోమీటర్ల దూరం లో ఉన్నవి . భుబనేశ్వర్ 16 వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్నది . చెన్నై -కోల్ కట (హౌరా ) రైలుమార్గం లో ఉన్నది .  

కామెంట్‌లు లేవు: