అరుణాచలేశ్వరస్వామి ఆలయం - తిరువణ్ణామలై
తమిళనాడు రాష్ట్రం లో చెన్నై నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో తిరువణ్ణామలై లో (ఇది జిల్లా కేంద్రంకూడా) అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది . తమిళ పదం తిరు అనగా శ్రీ అనే గౌరవ పదం ఇక్కడ ఉన్న గిరి పర్వతం పేరు అన్నామలై ఈ రెండు పదాలను కలిపి ఈ క్షేత్రం పేరు తిరువణ్ణామలై గా స్థిర పడింది ఇక్కడ శివుడు పంచ భూత లింగాములలో ఒకటైన అగ్ని లింగ రూపంలో ప్రతిష్టితమై ఉన్నాడు .
మిగిలిన లింగ రూపాలకు ఇక్కడ ఆలయాలున్నయి. అవి జంబుకేశ్వర జలలింగం ,శ్రీ కాళ హస్తీశ్వర వాయులింగం , కాంచీపురం లోని పృథ్వి లింగం చిదంబరం లోని ఆకాశ లింగం . పురాణాల కధనం ప్రకారం బ్రహ్మ విష్ణు సంవాద సమయంలో పరమ శివుడు వారికి జ్యోతిర్లింగ స్వరూపం దర్శన మివ్వటం ,ఆ తేజో స్వరూపం (అగ్ని)గిరి ఆకారం దాల్చిన (Annal అనగా శివుడు) "అన్నామలై " పర్వతం గా భావిస్తారు .ఈ పర్వతం ఎరుపు వర్ణం లో ఉంటుంది కాబట్టి సంస్కృతం లో అరుణా చలం లేదా అరుణ గిరి అని పిలుస్తారు . కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ కావిస్తే పరమ శివుడికి ప్రదక్షిణ చేసినట్లేనని యాత్రికుల విశ్వాసం .
గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల సాగుతుంది . మార్గమద్యంలో జగత్ ప్రసిద్దులైన భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం (ఆలయంనుండి 2 కిలోమీటర్ల దూరంలో) , అష్ట లింగాలు , అనేక తీర్థాలు ఇతర దేవాలయాలు కనిపిస్తాయి.
కాట్పాడి -విల్లుపురం సెక్షన్ రైల్వే మార్గంలో కాట్పాడికి షుమారు 100 కిలోమీటర్ల దూరంలో తిరువణ్ణామలై (TNM ) రైల్వే స్టేషన్ ఉన్నది . తమిళ నాడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్నది .తిరువణ్ణా మలై కు దగ్గరలో చెన్నైవిమానాశ్రయం ఉన్నది .


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి