27, ఫిబ్రవరి 2016, శనివారం

భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం -అరుణ గిరి - అరుణాచలేశ్వరస్వామి ఆలయం

అరుణాచలేశ్వరస్వామి ఆలయం - తిరువణ్ణామలై 


                                    తమిళనాడు రాష్ట్రం లో చెన్నై నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో తిరువణ్ణామలై లో (ఇది జిల్లా కేంద్రంకూడా) అరుణాచలేశ్వర  స్వామివారి  ఆలయం  ఉన్నది .  తమిళ పదం తిరు అనగా శ్రీ అనే గౌరవ  పదం  ఇక్కడ  ఉన్న గిరి  పర్వతం  పేరు  అన్నామలై  ఈ  రెండు  పదాలను  కలిపి  ఈ  క్షేత్రం  పేరు  తిరువణ్ణామలై  గా  స్థిర  పడింది  ఇక్కడ శివుడు  పంచ భూత లింగాములలో  ఒకటైన అగ్ని లింగ రూపంలో ప్రతిష్టితమై ఉన్నాడు .



                                            మిగిలిన లింగ రూపాలకు ఇక్కడ ఆలయాలున్నయి.  అవి జంబుకేశ్వర జలలింగం ,శ్రీ కాళ హస్తీశ్వర  వాయులింగం , కాంచీపురం లోని పృథ్వి లింగం  చిదంబరం లోని ఆకాశ లింగం . పురాణాల కధనం ప్రకారం బ్రహ్మ విష్ణు సంవాద సమయంలో పరమ శివుడు వారికి జ్యోతిర్లింగ స్వరూపం దర్శన మివ్వటం ,ఆ తేజో స్వరూపం (అగ్ని)గిరి ఆకారం దాల్చిన (Annal అనగా శివుడు) "అన్నామలై " పర్వతం గా భావిస్తారు .ఈ పర్వతం ఎరుపు వర్ణం లో ఉంటుంది కాబట్టి సంస్కృతం లో అరుణా చలం  లేదా అరుణ గిరి అని పిలుస్తారు .  కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ కావిస్తే  పరమ శివుడికి ప్రదక్షిణ  చేసినట్లేనని యాత్రికుల విశ్వాసం . 

                                           గిరి ప్రదక్షిణ  14 కిలోమీటర్ల సాగుతుంది . మార్గమద్యంలో జగత్ ప్రసిద్దులైన భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం (ఆలయంనుండి 2 కిలోమీటర్ల దూరంలో) , అష్ట లింగాలు , అనేక తీర్థాలు ఇతర దేవాలయాలు కనిపిస్తాయి.  
                                                కాట్పాడి -విల్లుపురం సెక్షన్ రైల్వే మార్గంలో కాట్పాడికి  షుమారు 100 కిలోమీటర్ల దూరంలో తిరువణ్ణామలై (TNM )  రైల్వే స్టేషన్ ఉన్నది . తమిళ నాడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్నది .తిరువణ్ణా మలై కు దగ్గరలో  చెన్నైవిమానాశ్రయం ఉన్నది .  

కామెంట్‌లు లేవు: