Tourist Express
Travel Information and some more Experience
27, ఫిబ్రవరి 2017, సోమవారం
24, ఏప్రిల్ 2016, ఆదివారం
Vally of flowers,Western himalayas,Uttarakhand
ఈ పుష్పాల లోయ ఉత్తరాఖండ్ లో బదరీనాథ్ కు దగ్గరగా చమేలి జిల్లాలో షుమారు 80 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది . ఈ లోయకు దగ్గరలో ఉన్న ప్రధాన పట్నం జోషిమఠ్ లేదా జ్యోతిర్ మఠ్. హరిద్వార్ ,ఋషికేశ్ ల నుండి బదరీనాథ్ వెళ్ళే మార్గం లో ఉన్నది . బదరీనాథ్ యాత్ర సాగుతున్న సమయంలో పలు బస్సు సర్వీసెస్ జ్యోతిమఠ్ మీదుగా ప్రయాణిస్తాయి . దగ్గరలో ఉన్న విమానాశ్రయం డెహ్రాడూన్ లో ఉన్నది
23, ఏప్రిల్ 2016, శనివారం
వారణాశి- పురాతన జ్యోతిర్లింగ లింగ క్షేత్రం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో గంగా నది పశ్చిమ తీరం లో ఉన్న భూభాగానికి ఉత్తర దక్షిణ దిశల్లో వరుణ , అశి అనే చిన్న నదులు గంగా నదిలో కలుస్తూ ఉండటం చేత వారణాశి అని బెనారస్ ('వ' కారం 'బ' కారం గా మారి ) అని సంక్షిప్తం గా కాశి అని కూడా పిలుస్తారు ) ఇది అతి పురాతన జ్యోతిర్లింగ లింగ క్షేత్రం . ఈ క్షేత్రం లో పరమేశ్వరుణ్ణి కాశి విశ్వేశ్వరుడు గాను లేదా కాశి విశ్వనాథుడు గాను, పార్వతి దేవిని విశాలాక్షి గాను కొలుస్తుంటారు . చరిత్రలో ఈ ఆలయం పలుమార్లు ముస్లిం దండ యాత్రల్లో నాశనమై , మరల పునఃనిర్మితమైనది . ఆ క్రమం లో 1780 సంవత్సరం లో ఇండోర్ పాలకురాలు రాణి అహల్యాబాయి హోల్కర్ చేత పునఃరుద్దరణ కావించబడినది . మీరా ఘాట్ లో విశాలాక్షి దేవాలయం అష్టా దశ శక్తి పితాల్లో ఒకటి , కాశి లో గల నవ గౌరీ లలో ఈ ఆలయం ఒకటి
Mount Abu, Rajasthan
మౌంట్ అబూ, రాజస్తాన్
మౌంట్ అబూ ఆరావళి పర్వతాలలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం . ఇది సముద్ర మట్టానికి ఎగువన ఉన్న ఎత్తైన పిత భూమి లో బాగం , గుజరాత్ రాష్ట్రానికి సరిహద్దు లో ఉన్నది (శిరోహి జిల్లా ). అబూ రోడ్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ .భారత దేశం లో ఉన్న ప్రముఖ తాత్విక విజ్ఞాన సంస్థ బ్రహ్మ కుమారి విశ్వ విద్యాలయం ప్రధాన కేంద్రం ఇక్కడే ఉన్నది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)



