రామగిరి ఖిల్లా వైభవం రెండు మతాల సమ్మేళనం
క్రీస్తు పూర్వం శాతవాహనుల కాలం నుండి 'రామగిరి' ఉనికిలో ఉన్నది. 10-11 శతాబ్దాల కాలంనుండి కళ్యాణిచాళక్యులు , కాకతీయరాజులు , బహమనీసుల్తానుల కడకు మొగలాయిల ఏలుబడి లో ఈ అద్బుత మైన ఈ కోట చరిత్ర కెక్కింది .
తెలంగాణా రాష్ట్రం లో పేరెన్నికగన్న ఈ కోట జిల్లా కేంద్రం కరీంనగర్ కు షుమారు 60 km దూరం లో కరీంనగర్ -పెద్దపల్లి -మంథని రోడ్డుమార్గం లో ఉన్నది . రైలు ప్రయాణ మైతే సికింద్రాబాద్ -నాగపూర్ రైలు మార్గం, విజయవాడ -నాగపూర్ రైలు మార్గాలలో గల పెద్దపల్లి స్టేషన్ కు షుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది . కోటను చేరుకోవాలి అంటే పెద్దపల్లి -మంథని రోడ్ మార్గంలో nagepalli junction నుండి begumpeta గ్రామానికి ఎలావచ్చినా అక్కడి నుండి కొంత దూరం కాలినడక సాగించాల్సి ఉంటుంది .
పరిసర దర్శనీయ ప్రదేశాలు
పరిసర దర్శనీయ ప్రదేశాలు
- begampeta కు 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరాన మంథని లో చరిత్ర కలిగిన గౌతెమేశ్వర దేవాలయం కాక ఇంకా పెక్కు దేవాలయాలు ఉన్నాయి .
- మంథని దగ్గరలో గల చంద్రవెల్లి గుళ్ళు చూడదగినవి .