8, మార్చి 2016, మంగళవారం

కావేరి నదిపాయల మద్య " శ్రీ రంగం" పుణ్య క్షేత్రం

శ్రీ రంగనాథ స్వామి ఆలయం, శ్రీరంగం, తమిళనాడు

                శ్రీ రంగం పుణ్య క్షేత్రం కావేరి నదిపాయల మద్య తిరుచిరాపల్లి (తిరుచ్చి )జిల్లాలో ఉన్నది , ప్రపంచం లోని అతి పెద్ద దేవాలయాలలో ఇది ఒకటి ( 156 ఎకరాలలో విస్తరించి ఉన్నది ). శ్రీ మహా విష్ణువు  స్వభువు గా వెలసిన 8 క్షేత్రాలలో ఇది ప్రధానమైనది . 108 వైష్ణవ దేవాలయాలలో ఇది ఒకటి . ఇక్కడ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి ,పెరియా కొయిల్ ,భూపాల వైకుంఠం,భోగమండపంఅని కుడా పిలుస్తారు . 7 ప్రాకారాలతో కూడిన ఈ ఆలయ ప్రాంగణం  లో శ్రీ రంగనాథ స్వామి ,రంగనాయకి అమ్మవార్ల తో పాటు 50 ఇతర దేవతా మూర్తులకు ఉపాలయాలు ఉన్నాయి .



                                              చెన్నై నగరానికి 340 కిలోమీటర్ల దూరం లో ఉన్నది ,చెన్నై ,మదురై , రామేశ్వరం  మొదలైన ప్రాంతాలకు railway connectivity  ఉన్నది . ఇంచుమించుగా తమిళనాడు  నడిబోడ్డున  ఉన్న శ్రీరంగానికి  రాష్ట్రము లోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడకు  బస్సు సర్వీసులు నడపబడుచున్నవి . ఎయిర్ పోర్ట్ ఉన్న  తిరుచిరాపల్లి కి అతిదగ్గరలో15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . 
                                           65 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు లో యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడిన బృహదీశ్వర ఆలయం  ఉన్నది . 108 వైష్ణ వ దివ్య క్షేత్రాలు  పుండరికాక్ష పెరుమాళ్  దేవాలయం తిరుచినాపల్లి కి 15 కిలోమీటర్ల దూరంలో తిరువెల్లారై  నందూ,   మనవాళ పెరుమాళ్ ,కమలవల్లి ఆలయం తిరుక్కోళి తిరుచిరాపల్లి నగరం లోనే ఉరయూర్ లోను ఉన్నవి . శ్రీ రంగం క్షేత్రం లోనే రంగనాథ స్వామి వారి దేవాలయానికి కిలోమీటర్ల దూరంలోనే పంచ భూత లింగాలలో ఒకటైన( జల లింగం) జంబుకేశ్వరలింగ క్షేత్రం ఉన్నది . 

కామెంట్‌లు లేవు: